Sunday, May 23, 2010

వేటూరి అస్తమయం !!!

వేటూరి అస్తమయం తో ఒక పాటల శకం ముగిసింది అని చెప్పవచ్చు....ఒక్క పరభాషాపదం కూడా లేకుండా పాట కావాలంటే అది వేటూరి వల్లే అవుతుంది అని నిర్మాతలు ఇప్పటికీ నమ్ముతున్నారు కాబట్టే కొత్తగా వచ్చిన బ్లాక్బస్టర్ "సిం హా " లో "కల్యాణం కల్యాణం లక్ష్మినరసిమ్హా కల్యాణం.." పాట రాయించుకున్నారు....సినిమాలు ఆడక పోయినా ఆయన పాటలు వాడవని "వరుడు" సినిమాలో ఆయన రాసిన "అయిదు రోజుల పెళ్ళి అమ్మంటి పెళ్ళీ...." అనే పాట చెపుతుంది...
"ఆకుచాటు పింద తడిసే..." అని శ్రుంగారాలు కురిపించినా,
"శంకరా నాద శరీరాపరా..." అని భక్తిభావం ఒలికించినా,
"ఆరేసుకోబొయి పారేసుకున్నాను హరి హరి..." అని కొంటె పాటలు రాసినా,
"క్రుషి ఉంటే మనుషులు రుషులవుతారు..." అని అడవిరాముడు లో గిరిజనుల వెన్నుతట్టినా,
"ఈ దుర్యోధన దుశ్సాసన దుర్వినీతలోకంలో..." అని తప్పుదారిన పడుతున్న యువత నీ & కళ్ళు ఉండీ చూడలేని గుడ్డి ప్రభుత్వాలనీ చీల్చి చెండాడినా ,
గూండాలకే ఓటు రౌడీలకే సీటు దేశానికే చేటు..." అని ప్రజలను మరియు రాజకీయ పార్టీలను హెచ్చరించినా,
"ధన్వంతరి వారసులం ధరణి లోన దేవతలం..." అని ఎవరు సమ్మె చెసినా డాక్టర్లు సమ్మె చేయకూడదని హితవు చెప్పినా,
"వేణువై వచ్చాను భువనాని కీ...." అని విషాదం పలికించినా,
అది ఒక్క వేటూరి కలానికే చెందింది....ఇంతటి వైవిద్యం మరి ఇక ఏ భారతీయ కలానికైనా ఉంటుందని అనుకోను..
ఎక్కడున్నా ఆయన ఆత్మకి శాంతి కలగాలని కాంక్షిస్తూ ఇదే నా అక్షర నివాళి !!!
-సత్య