Saturday, June 08, 2013

పెను "అవినీతి తుఫాను" తలొంచి చూసిన తొలి నిప్పు కణం అతడే !!

సి బి ఐ జేడి లక్ష్మీనారాయణ...పెను "అవినీతి తుఫాను" తలొంచి చూసిన తొలి నిప్పు కణం !!
"అవినీతి అధికారులు" అనే గంజాయి వనంలో తులసి మొక్క వంటివాడు! ఫాక్షనిస్టుల బెదిరింపులుకి అదరక బెదరక, మరెన్నో వత్తిళ్ళు తట్టుకుని,కార్పోరేట్ అవినీతి దిగ్గజాల గుండెల్లో రైళ్ళు పరిగెత్తించిన అధికార యోథుడు..  సి బి ఐ అంటే "కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్" అని ముద్ర పడిన ఈరోజుల్లో రాష్ట్రంలో దాని ప్రతిష్టని మరింత పెంచి ఆ పదవి కే వన్నె తెచ్చిన ఉత్తమ ఉన్నతాధికారి.ఎంతమంది ఎన్ని విమర్శలు చేసినా మరెన్నో శాపనార్ధాలు పెట్టినా తొణకకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్ళాడు.దేశానికి ఇప్పుడు ఇలాంటి అధికారుల అవసరం ఎంతైనా ఉంది.
పదవీ కాలం ముగియటం తో ఇతన్ని మహారాష్ట్ర కి బదిలీ చేసిన సందర్భంగా ఒక విద్యాసంస్థ సన్మాన సభలో విద్యార్థులకు దిశానిర్దేశం చేస్తూ చక్కటి తెలుగులో సాగిన అతని ప్రసంగం ఆహుతులను ఎంతగానో ఆకట్టుకుంది.

మీ కోసం యూ ట్యూబ్ లింక్ ఇక్కడ ఇస్తున్నాను: