Sunday, October 31, 2010

ఇటీవల రాష్త్రం లో జరిగిన రెండు సంఘటనలు...

ఇటీవల రాష్త్రం లో జరిగిన రెండు సంఘటనలు...
అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహ దగ్దం: ఈ సంఘటన మాత్రం నా మనసుని తీవ్రం గా కలచి వేసింది....నాకు తెలిసి, ఆయన కేవలం మద్రాస్ రాష్ట్రం నుంచి ఆంధ్ర రాష్ట్రాన్ని మాత్రమే కోరి ఆ దిశగా ధ్రుఢ చిత్తం తో, అహింసా పద్దతి లో పోరాడి తన ప్రాణాలనే పణంగా పెట్టి దాన్ని సాధించాడు[1953 లో].మరి ఆ తరువాత 3 ఏళ్ళకి 1956 లో ఏర్పడిన సమైఖ్య రాష్ట్రావతరణకు ఆయనికి ఏమిటి సంబంధం? ఆయన ఉద్యమ స్ఫూర్తి ని ఆదర్శంగా తీసుకోవల్సింది పోయి అమరజీవి విగ్రహాన్నే తగులపెట్టిన దుండగులకీ మరియూ తాలిబాన్ లో బుద్దుడి విగ్రహాలని కూల్చిన ఉగ్రవాదులకి మధ్య నాకు ఆట్టే తేడా కనపడటం లేదు....అసలు ఇలాంటి దుశ్చర్యల కారణంగానే వారు కోరుకునే ప్రత్యేక రాష్ట్రం ఆలస్యం అవుతుందనే విషయం తెలుసుకోలేక పోతున్నారు...మన రాష్ట్రంలో కొలువు తీరిన మూగ గుడ్డీ చెవిటి నపుంసక ప్రభుత్వానికి ఇవేమీ పట్టవు....ఇక ప్రతిపక్షం అంటారా....దాని స్థితి మరింత ఆగమ్యగోచరంగా తయారయ్యింది....
తెలుగు కి త్రుటిలో తప్పిన అవమానం:మరో సంఘటన, టి సుబ్బరామి రెడ్డి అనబడే ప్రచార పిశాచి కి తన పదవీ దాహం లోనించి ఒక ఆలోచని పుట్టింది...అదేమిటంటే, "హైదరబాదు నగర నడి బొడ్డున నెలకొని రాష్ట్రం లోనే మొట్టమొదటి ఓపెన్ థియేటర్ గా ఖ్యతి నార్జించిన "తెలుగు లలిత కళా తోరణం" [నేను నర్తనశాల సినిమా ఇక్కడే చూసాను ] కి రాజీవ్ గాంధీ కళా తోరణం పేరు పెట్టి ఇటలీ అమ్మను ప్రసన్నం చేసుకుని మంత్రి పదవి కొట్టేయటం". ఇదీ వారి ఆలోచన...ఆలోచన రావటమే తరువాయి, రాష్ట్రం లో ఉన్న దిష్టి బొమ్మ ప్రభుత్వాన్ని బైపాస్ చేసి డిల్లీ నించి అనుమతి తెచ్చుకోవటమూ, దానికి 3 జీ ఓ లు జారీ కావటమూ చక చకా జరిగిపోయాయి...విషయం బయటకు తెలవగానే మీడియా లో ప్రజలు, ప్రజా సంఘాలు మరియూ వివిధ రాజకీయ పార్టీలు తీవ్రం గా వ్యతిరేకించటం తో పాటు తెలుగు దేశం పార్టీ పబ్లిక్ గార్డెన్స్ లో చేపట్టిన నిరసన కార్యక్రమం తో తనకు తానుగా "కళా బంధు" అని అభివర్ణించు కొనే సదరు పిశాచి దిగి వచ్చి తన ప్రణాలిక ను ఉపసం హరించుకోవటం తో తెలుగు భాషాభిమానులందరూ ఊపిరి పీల్చుకుంటున్నారు.....తెలుగు వారి అంతర్జాతీయ విమానాశ్రయం పేరు మార్పు విషయంలో కూడా ఇదే ఐఖ్యతా పోరాట పటిమ కావాలి....ఆ దిశగా ఉద్యమించి విమానాశ్రయానికి మన తెలుగువారి పేరు పెట్టించుకోవాలి.......తెలుగువారికి అంతర్జాతి ఖ్యాతి నార్జించి పెట్టిన పెద్దాయన ఎన్ టీ ఆర్ కు అదే నిజమైన నివాళి అవుతుంది.....

Friday, October 22, 2010

రక్త చరిత్ర !!

రక్త చరిత్ర సినిమా - నాణేనికి ఒకవైపు:
సినిమాను ప్రకటించినప్పటి నుంచీ వార్తలలో ఉంటూ వస్తూన్న "రక్త చరిత్ర-1" సినిమా ఓబులరెడ్డి వర్గాల బెదిరింపులను, స్వచ్చంద సంస్థల హెచ్చరికలను మరియూ సెన్సారు అవరోధాలను కూడా దాటుకుని ఎట్టకేలకు నిన్న ప్రేక్షకుల ముందుకొచ్చింది.సినిమా లో పెద్దాయన ఎన్ టీ ఆర్ ని పోలిన ముఖ్యమంత్రి పాత్ర ని చిత్రీకరించిన విధానం ఆయన ను ఆరాధ్యదైవం గా భావించే అశేష అభిమాన జన మనోభావాలను గాయపరిచేవిధంగా ఉంది అని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.....ఆ విమర్శల ధాటికి, క్షమాపణ అనే పదానికి నా నిఘంటువు లో చోటు లేదు అని తరచూ ప్రకటించుకునే వర్మ మీడియా ముందుకొచ్చి క్షమాపణ లు చెప్పి "అభ్యంతరకర సన్నివేశాలు గా భావిస్తున్న వాటిని తొలగిస్తున్నాను అని ప్రజలకి మాటివ్వటం జరిగింది".
నాకు కూడా సినిమా చూస్తున్నప్పుడు, ముఖ్యమంత్రి పాత్ర కథానాయకుడు కి అండగా నిలబడినందున అంతగా అనిపించలేదు కాని , థియేటర్ నుంచి ఇంటికొచ్చిన తరువాత విశాల ధ్రుక్పథం తో ఆలోచించినపుడు, "అవునూ, పెద్దాయన "అహం ! బ్రహ్మాస్మి" టైపు అనే తెలుసు గాని ఏనాడూ కక్షలు కార్పణ్యాలకు కొమ్ము కాసినట్లు గా లేదా ప్రోత్సహించినట్లు గా ఎప్పుడూ చదవలేదు వినలేదు కదా... ఇలా చూపించారేంటి" అని అనిపించింది.
మరో విషయం ఎమిటంటే, రాయలసీమలో ని అనంతపురం నేపధ్యం ఉన్న ఈ యదార్థ గాథ లో అదే నేపధ్యం కొరవడింది....మీకు సినిమాలో ఎక్కడా రాయలసీమ లేక తెలుగు వారి నేపధ్యం కనపడదు....కాని టీవి9 లాంటి మీడియా మైకులు మాత్రం కనపడతాయి....మరి 82 లెదా 83 లో ఎలెక్ట్రోనిక్ [ఉదా:టీవి9..] మీడియా ఎక్కడుందో సినిమా చూసే ప్రేక్షకుడికి బోధపడదు....సినిమా అంతా సాగే వాయిస్ ఓవర్ ని వర్మ కాకుండా రవిప్రకాష్ లాటి డబ్బింగ్ ఆర్టిస్ట్ తో చెప్పించి ఉంటే బావుండేదనిపించింది.
పరిటాల రవి హైదరాబాదు గూడాలని ఇంటికి ఆహ్వానించి రాగి సంకటి కోడికూరలతో భోజనం పెట్టించి గూండాగిరీలు భూకబ్జాలు ఇకపై నగరం లో ఎక్కడా జరగ కూడదని హెచ్చరించటం తో ముగించి మిగతా నవంబర్ 19న విడుదల కాబోయే "రక్త చరిత్ర-2" లో చూసుకోమన్నారు....తమిళ నటుడు సూర్యా కూడా రెండవ భాగం లోనే మద్దెలచెరువు సూరి గా రాబోతున్నాడు....ఇది కచ్చితంగా మహిళలు పిల్లలు చూడ తగిన సినిమా కాదు అని ప్రేక్షక లోకం మరియూ మీడియా కూడా కోడైకూస్తోంది....
రక్త చరిత్ర సినిమా - నాణేనికి మరో వైపు:
సాంకేతికంగా చూస్తే , ఉత్కంఠభరితమైన కథనానికి [స్క్రీన్ ప్లే] పర్యాయ పదం వర్మ....పెద్దగా మలుపులు లేని ఇలాంటి కథని తీసుకుని [ప్రేక్షకులు వెకిలి హాస్యానికి పంచ్ డైలాగులకీ అలవాటుపడిపోయిన ఈ రోజుల్లో] తెరపై ఆవిష్కరించిన విధానం [హింస ని మరియూ బుక్కారెడ్డి శ్రుంగార సన్నివేశాలని మినహాయించి] ప్రేక్షకులని మంత్రముగ్దులని చేసి కుర్చీలకి కట్టి పడేస్తుంది....
**** సశేషం ! ****

Thursday, October 07, 2010

ఖలేజా!

దాదాపు 3 సం తరువాత మహేష్ బాబు ఖలేజా సినిమాతొ ప్రేక్షకులని పలకరించాడు....మొదటి రోజు మొదటి ఆట కి కుటుంబ మిత్ర సమేతంగా వెళ్ళి చూసాము....దాని గురించి కొన్ని విషయాలు...
సినిమాలో ఆకట్టుకున్నది ఒకే ఒక్కటి: అది మహేష్ బాబు సరికొత్త నటన...I dont call him as Indian David Curaso from CSI:Miami any more.
అంతుబట్టని విషయాలు:
1. 3 ఏళ్ళ సమయం తీసుకుని 50 కోట్లు ఖర్చుపెట్టీ తీసిన సినిమాలో తెర మీద కనపడేది మాత్రం అంతా మట్టే! ఆ డబ్బంతా వేటికి ఖర్చు చేసినట్టూ?
2.దేవుడు అంటున్నారని కాకపోయినా, తనకు ప్రాణ దానం చేసిన క్రుతఙ్నత తో నైనా సిద్దప్ప [షఫి] మనుషుల తరుపున పోరాడవచ్చు కదా! ఎందుకు పారిపోయినట్లు ?
3.సినిమా అంతా ఏదో చీకటి గుహ లో తీసినట్టు ఎందుకుంది?
4.ఒక్క పాటలో కూడా మంచి కోరియోగ్రఫి ఎందుకు ఇవ్వలేక పోయారు?
5."గట్టి ప్రత్యర్థి తొ తలపడినప్పుడే కథానాయకుడి వీరత్వం లోకానికి తెలిసేది " అన్న ప్రాథమిక సూత్రాన్ని ఎందుకు మరచారు?
దర్శక నిర్మాతల్లారా ! వీటికి సమాధానం తెలిసీ చెప్పక పోయారో మహేష్ మిమ్మల్ని పద్మాలయా చాయల క్కూడా రానివ్వడు.